జగిత్యాలలో అర్ధరాత్రి కలకలం.. కౌన్సిలర్పై కత్తులతో దాడి..!
జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి కలకలం రేగింది. 15వ వార్డు కౌన్సిలర్ అనుమల్ల శ్రీను అలియాస్ కోర్టు శ్రీనుపై హత్యాయత్నం జరిగింది. అతను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు కత్తులతో దాడి చేశారు. విచక్షణరహితంగా వేటు వేయడంతో శ్రీను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఐదుగురు వ్యక్తులు కత్తులు వెంటబెట్టుకుని అర్ధరాత్రి సమయంలో శ్రీను ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. దుండగులు అకస్మాత్తుగా దాడిచేయడంతో శ్రీను తప్పించుకోవడానికి వీలుపడలేదని సమాచారం. దాంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు శ్రీను ఇంటికి వచ్చారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పాతకక్షల నేపథ్యంలో శ్రీనుపై దాడి జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications