శోభ చెప్పిన మాట ఇదీ, సంతోష్ కేసీఆర్ కొడుకట, బోడిగె శోభ సంచలనం, కే ఫ్యామిలీపై నిప్పులు
కల్వకుంట్ల ఫ్యామిలీపై బీజేపీ భగ్గుమంది. బీజేపీ నేత బోడిగె శోభ తనదైన శైలిలో విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ కుమార్పై విరుచుకుపడ్డారు. మంథనిలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కల్వకుంట్ల కుటుంబం కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ బంధువులకే పదువులు వచ్చాయని.. నిరుద్యోగుల సంగతి ఏంటీ అని అడిగారు. నోటిఫికేషన్ రావడం లేదని సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటీ అని నిలదీశారు. తెలంగాణ తీసుకొచ్చింది.. కేసీఆర్ కుటుంబం కోసమా.. లేదంటే ప్రజల కోసమా అని అడిగారు.

సంతోష్.. కేసీఆర్ కొడుకేనట..
నిరుద్యోగుల ఉపాధి మరిచారు అని శోభ ఫైరయ్యారు. కేసీఆర్కు సీఎం పదవీ, కూతురు కవిత ఎమ్మెల్సీ, కుమారుడు కేటీఆర్ మంత్రి అయ్యారని తెలిపారు. నిజామాబాద్ లోక్ సభ నుంచి కవిత ఓడిపోయిన తర్వాత నాలుగురోజుల్లో పదవీ కట్టబెట్టారని చెప్పారు. ఎమ్మెల్సీ చేసేవరకు నిద్రపట్టలేదని చెప్పారు. సంతోష్ కుమార్కు కూడా పదవీ కట్టబెట్టారని చెప్పారు. సంతోష్.. కేసీఆర్ అన్ అఫీషియల్ కుమారుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ విషయం కేసీఆర్ భార్య శోభ చెప్పారని తెలిపారు. అంతేకాదు తనకు భయం లేదని చెప్పారు.

ఆయన ఆడ కాదు మగ కూడా కాదట..
మాజీ ఎంపీ వినోద్ కుమార్ గురించి కూడా శోభ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఆడది కాదు మగొడు కాదు అన్నట్టు అని ఫైరయ్యారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్ననమేని రమేశ్ బాబు గురించి కామెంట్స్ చేశారు. కాళ్లు, రెక్కలు లేవు అని విరుచుకుపడ్డారు. జర్మనీలో ఉంటారని మండిపడ్డారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.. రోజు ఉదయం పిడికెడు గోలిలు మింగుతాడని చెప్పారు. జగిత్యాలలో సంజయ్ కుమార్ డాక్టర్ ప్రాక్టీస్ చేసుకునే వారని చెప్పారు. తోక చుట్టం అని ఎమ్మెల్యే చేశారని ఫైరయ్యారు.

కేటీఆర్ చస్తే..
కల్వకుంట్లకు కనువిప్పు కలుగాలని శోభ అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు కూడా అధికార పార్టీకి వంతపాడటం సరికాదన్నారు. నిరుద్యోగులు చనిపోతే ఆ తల్లిదండ్రుల గర్భశోకం వర్ణానాతీతం అని చెప్పారు. కేటీఆర్ చనిపోతే మీకు ఆ బాధ తెలుస్తుందని చెప్పారు. అప్పటివరకు జనాల బాధ తెలియదు అని ఫైరయ్యారు. మంథనిలో ఓటమితో మీకు బాధ తెలిసిందన్నారు.

అబద్దాల పునాదుల మీద
ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని శోభ ఫైరయ్యారు. ఉద్యమ సమయంలో అలుగునూరు చౌరస్తాలో దెబ్బలు తిన్నానని చెప్పారు. ఇంటికొక ఉద్యోగం అని చెప్పి మోసం చేయడం మీకే చెల్లిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కూడా చీట్ చేయడం సరికాదని తెలిపారు.












Click it and Unblock the Notifications