భద్రాద్రి రాములోరికి పట్టువస్త్రాలు.. భక్తజనులకు ముత్యాల తలంబ్రాలు
భద్రాద్రి : సమస్త భక్తజనులు లోక కల్యాణంగా భావించే శ్రీ సీతారాముల కల్యాణం భద్రాద్రిలో కనుల పండువగా జరిగింది. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్న సుముహుర్తాన జానకీరాముల కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరాముడికి యజ్ఞోపవీతధారణ, సీతాదేవికి యోత్రబంధనం కార్యక్రమాలను అర్చకులు నిర్వర్తించారు. రామాలయంలోని మిథిలా ప్రాంగణంలో జరిగిన రాములోరి లగ్గానికి భక్తజనులు పోటెత్తారు. సీతారాముల కల్యాణం కనులారా వీక్షించి జన్మధన్యమైనట్లుగా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవానికి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాములోరి కల్యాణానికి పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో.. భద్రాద్రి ఆలయం కిటకిట లాడింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగేలా మిథిలా ప్రాంగణంలో కూలర్లు, ఫ్యాన్లు సమకూర్చారు.

ప్రతి యేటా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణం వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 3 లక్షల మేర లడ్డూలను సిద్ధం చేశారు ఆలయ అధికారులు. తలంబ్రాల పంపిణీకి 34 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications