శ్రీశైలంలో కలకలం రేపిన అన్యమత పార్శిల్... ఇంతకీ అందులో ఏముంది...
హిందూ దేవాలయాలపై దాడులు... విగ్రహాల ధ్వంసంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో శ్రీశైలంలో ఓ అన్యమత పార్శిల్ కలకలం రేపింది. ఆలయానికి సమీపంలో ఉన్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఇంటి చిరునామాకు ఈ పార్శిల్ వచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే... శ్రీశైలం ఆలయంలో పనిచేసే ఓ వ్యక్తి ఆలయానికి సమీపంలోని ఎస్సీ కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గురువారం అతని ఇంటి చిరునామాతో ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు ఓ పార్శిల్ వచ్చింది. దానిపై క్రిస్టియన్ సంస్థ గుర్తులు ఉండటంతో స్థానికులు దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఆ పార్శిల్ను స్వాధీనం చేసుకుని చిరునామాను పరిశీలించారు. ఆలయంలో పనిచేసే ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి ఆ పార్శిల్ వచ్చినట్లు గుర్తించారు. ఆపై ఆ ఉద్యోగిని పోలీస్ స్టేషన్కు పిలిపించి దానిపై ఆరా తీశారు. ఆ పార్శిల్ను ఓపెన్ చేసి చూడగా క్రిస్టియన్ సంస్థ ఆ కుటుంబానికి నెలవారీ నిత్యావసరాలను పంపించినట్లు గుర్తించారు. శ్రీశైలంలో అన్యమత ప్రచారాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కాగా,ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలు, విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలోని కొల్లూరులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. అంతకుముందు కర్నూలు జిల్లా పత్తికొండలోనూ ఓ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.అలాగే కృష్ణాజిల్లాలోని మక్కపేటలో ఉన్న కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహంపై కూడా పాక్షికంగా దాడి చేశారు. ఇలా హిందూ ఆలయాలు,విగ్రహాలపై వరుస దాడులతో బీజేపీ,భజరంగ్దళ్ కార్యకర్తలు ప్రభుత్వంపై కన్నెర చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భజరంగ్దళ్ కార్యకర్తలు ఇటీవల హైదరాబాద్ లోటస్పాండ్లోని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications