మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరి వేయొద్దనే అధికారం కేసీఆర్‌కు ఎక్కడిది? రైతు ఆవేదన సభలో షర్మిల

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర ఆదివారం ప్రారంభమైంది. తొలి రోజు మెదక్ జిల్లా నర్సాపుర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండలంలోని కంచన్ పల్లి, లింగంపల్లి గ్రామాల మీదుగా యాత్ర సాగింది. ఆత్మహత్యలు చేసుకున్న ముగ్గురు రైతుల కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు గుండ్ల శ్రీకాంత్, శేఖర్, మహేష్ కుటుంబాలకు ధైర్యం చెప్పారు. కంచన్ పల్లి గ్రామానికి చెందిన రైతు గుండ్ల శ్రీకాంత్ అప్పులు పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్‌కు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన మరో రైతు మహేష్ తనకున్న రెండు ఎకరాల్లో భూమి ఉండగా 10 బోర్లు వేసినా నీళ్లు రాలేదు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు కూడా రాలేదు. అప్పులు పెరిగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు లింగంపల్లి గ్రామంలో షేకులు అనే రైతుకు రెండెకరాల భూమి ఉండగా ఫైనాన్స్ కింద ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఫైనాన్స్ పెంచడం, పంట సరిగ్గా పండకపోవడంతో అప్పులు పెరిగాయి. ఈ 3 కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోగా, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం వచ్చి చూడలేదు. ఆయా కుటుంబాలను వైయస్ షర్మిల గారు పరామర్శించి, ధైర్యం చెప్పారు.

పూటకో మాట..

పూటకో మాట..

పండించిన పంటలను ప్రభుత్వం కొనకపోవడం, యాసంగిలో వరి వేయవద్దని చెప్పడం, రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పాపం కేసీఆర్‌దేననివ విమర్శించారు. ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ఊసరవెళ్లిగా మాటలు మారుస్తున్నాడు. ఒక సారి సన్న బియ్యం వేయాలని, ఇంకోసారి అసలు వరి వేసుకోవద్దని, మరోసారి ఆఖరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. రైతుల జీవితాలతో కేసీఆర్ ఆటలాడుకుంటున్నాడు. వరి వేయొద్దని చెప్పే ముఖ్యమంత్రి కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టినట్టు? లక్షల కోట్ల అప్పులు తెచ్చి. ఆ భారాన్ని అంతా రాష్ట్ర ప్రజలపై మోపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లులే వేలకోట్లు అవుతున్నాయి. కేసీఆర్ కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతూ రైతులను నట్టేట ముంచుతున్నాడు. ఇలా ఎంత మంది రైతులను ఆత్మహత్య బాట పట్టిస్తూ..ఇంకెంత మంది రైతులను పొట్టన పెట్టుకుంటావు కేసీఆర్? అని అడిగారు.

వరి కాక ఏ పంట..

వరి కాక ఏ పంట..

బావులు, చెరువులు, కాల్వల కింద తెలంగాణలో భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి. తాతల కాలం నుంచి చెరువు కింద భూములు ఉన్న రైతులు వరినే పండిస్తున్నారు. ఎవరిని అడిగి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసి ఇచ్చారు. వరి వేయబోమని కేసీఆర్ కేంద్రానికి లేఖలో సంతకం ఎలా చేస్తాడు? కేసీఆర్ కు ఏ హక్కు ఉందని వరి వేసుకోవద్దని చెబుతున్నాడని షర్మిల ప్రశ్నించారు. మద్దతు ధర ఉంది అంటే దాని అర్థం వరి వేసుకునే హక్కు ఆ రైతుకు ఉంది. వరి వేసిన ఆ రైతు పంట కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అలాంటప్పుడు వరి వేయవద్దని చెప్పే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది? అని అడిగారు. కేసీఆర్ పాలనతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 70 రోజుల్లోనే 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం కేసీఆర్ ది కాదా? ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం కింద రూ.25లక్షలు అందజేయాలని డిమాండ్ చేశారు. వరి వేసుకునే హక్కు ప్రతీ రైతుకు ఉంది. యాసంగిలో వరి కొనాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.

ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

బంగారు తెలంగాణ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని షర్మిల ఫైరయ్యారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవీ చేపట్టి 7 ఏండ్లు అవుతున్నా.. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయే త‌ప్పా త‌గ్గ‌డం లేదన్నారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ అంటున్నాడు. మద్దతు ధర ఉంది అంటే దాని అర్థం వరి వేసుకునే హక్కు ఆ రైతుకు ఉంది. వరి వేసిన ఆ రైతు పంట కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందన్నారు. వరి వేయవద్దని చెప్పే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. కేసీఆర్ రైతులందరినీ మోసం చేశాడు. రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ చేస్తున్న హత్యలే.. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనలో అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమ్మకు అన్నం పెట్టడు గానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. మన రాష్ట్రంలో ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని కేసీఆర్ హర్యానాలో రైతులు చనిపోతే ఒక్కొక్కరికీ రూ.3 లక్షలు ఇస్తానని చెప్పాడు. తెలంగాణ రైతులవి ప్రాణాలు కావా..? ఎన్నికల హామీలో ఇచ్చిన ఒక్కమాట కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.

పావలా వడ్డీకే రుణాలు..

పావలా వడ్డీకే రుణాలు..

నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మూడెకరాల భూమి ఇలా ఏ ఒక్క మాటా నిలబెట్టుకోలేదు. పింఛన్ కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి మనకు అవసరమా..? రైతులందరూ ఆశీర్వదించిన రోజున మళ్లీ వైయస్ఆర్ పాలన తీసుకువస్తామని చెప్పారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడంతో పాటు మహారాణులను చేసే బాధ్యత YSR తెలంగాణ పార్టీదేనని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం అని హామీ ఇచ్చారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టారో సీఎం చెప్పాలన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారన్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కడుపు నిండుతదని ప్రశ్నించారు. వరి వేయమని సీఎం కేసీఆర్ కేంద్రానికి ఎందుకు రాసిచ్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దిక్కుమాలిన పాలన వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

English summary
ysrtp chief sharmila angry on cm kcr. who is kcr, ask to farmers not cultivate paddy she alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X