Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దూసుకొచ్చి ఢీకొట్టిన బైక్: ఆర్టీసీ రాజధాని బస్సు దగ్ధం, వ్యక్తి మృతి

నల్గొండ: సూర్యపేట జిల్లా మునగాల మండలంలో ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొంది. తెలంగాణ ఆర్టీసీ(TSRTC)కి చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందిరానగర్ వద్దకు రాగానే బస్సును బైక్ వేగంగా ఢీకొట్టింది.

ఆర్టీసీ బస్సు కింది భాగంలోకి బైక్ వెళ్లడంతో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు వేగంగా బస్సును అంటుకున్నాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోయారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే బస్సు మొత్తం దగ్ధమైంది.

Bike collided with TSRTC Rajadhani bus: one killed.

ఇక బైక్ నడిపిన మురుగేష్ రాజు(48)కి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ బస్సు మియాపూర్ డిపోకు చెందినది.

ఇది ఇలావుండగా, ఏపీలోని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 6 గంటలకుపైగా రైలు నిలిచిపోయింది. ఆ తర్వాత విశాఖకు బయల్దేరింది. రైలు పట్టాలపై బొలెరో వాహనాన్ని వదిలి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+