మార్చి 28న యదాద్రి పున:ప్రారంభం.. జర్నలిస్టులకు కాలనీ: సీఎం కేసీఆర్
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పునః ప్రారంభ ముహూర్త పత్రికను దేవస్థానం ఈవోకు అందజేశారు. ముహూర్త పత్రికను స్వామి పాదాల చెంత ఉంచాలని సూచించారు. త్రిదండి రామానూజ చినజీయర్ స్వామి ముహూర్త పత్రిక రాసి ఇచ్చారు. 10 వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. మార్చి 28వ తేదీన పున:ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. హోమాన్ని చినజీయర్ స్వామి పర్యవేక్షిస్తారని చెప్పారు.

బిజీ బిజీ
ఉదయం నుంచి సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం.. ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గండి చెరువు, పుష్కరణి, కల్యాణకట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రతమంటపం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు, గర్భాల ద్వారాలు, బంగారు తాపడాలు, ఆళ్వార్ మంటపం పనులను పరిశీలించారు. క్యూకాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితో పాటు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం, ధ్వజస్తంభం ఏర్పాటు చేసిన వేదికను సైతం పరిశీలించగా.. పనుల పురోగతిని సీఎంకు ఆలయ స్తపతి ఆనంద్సాయి వివరించారు.

సూచనలు
తుది పనులపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్రెడ్డిని ఆదేశించారు. రింగు రోడ్డు కోసం షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని సూచించారు.
Recommended Video

జర్నలిస్ట్ కాలనీ
ఇటు యాదాద్రిలో జర్నలిస్ట్లకు ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు అడిగినట్లు మోత్కుపల్లి నర్సింహులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ మేరకు ఇళ్ల స్థలాలలు కేటాయించే బాధ్యతను అప్పగిస్తూ మంత్రికి ఆదేశాలిచ్చారు. మంత్రి, కలెక్టర్, వైటీడీఏ అధికారులు చర్చించి.. ఎలా కేటాయించాలో చర్యలు తీసుకుంటారన్నారు. 'యాదాద్రి జర్నలిస్ట్ కాలనీ' అంటేనే గొప్పగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుందామన్నారు. క్షేత్రమెంత గొప్పగా బాగుంటుందో.. కాలనీ కూడా అంత గొప్పగా ఉండాలని.. దాంతో మనకు కారణంగా నిలుస్తుందన్నారు. జర్నలిస్టులు వార్తల వాహకులని.. ఆలయ నిర్మాణానికి సంబంధించి, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రం, ఆధ్యాత్మిక సంపదను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు క్షేత్రానికి సంబంధించిన ప్రత్యేక పరిశోధన వ్యాసాలు, కథనాలు రాయాలని మీడియా ప్రతినిధులను కోరారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications