వైసీపీ నెక్స్ట్ టార్గెట్ మాజీమంత్రి సోమిరెడ్డి..ఓ భూ వివాదంలో కేసు నమోదు...నోటీసులు జారీ
ఏపీ మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగలింది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రులు , కీలక నాయకుల మీద కేసుల పర్వం కొనసాగుతుంది. ఇక ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంతు వచ్చింది . ఓ భూ వివాదం కేసులో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో తలెత్తిన భూ వివాదంపై సమాధానం చెప్పాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు . నెల్లూరు రూరల్ సర్కిల్ సీఐ రామకృష్ణ పేరిట తయారైన నోటీసును వెంకటాచలం ఎస్ఐ కరీముల్లా శుక్రవారం అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లి అందజేశారు. శుక్రవారం సాయంత్రం కోర్టు ఆదేశాలతో, వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి రెవెన్యూ డివిజన్ కింద ఫోర్జరీ పత్రాలతో సర్వే నెం .58-3లో 2.41 ఎకరాల భూమిని అమ్మడంపై సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డిపై ఎ 1 గా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు .

ఇడిమేపల్లిలో కొందరు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దానికి సంబంధించిన అంశాలను విచారించేందుకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో మాజీ మంత్రి సోమిరెడ్డి కి కేసుల బాధ తప్పలేదని చెప్పొచ్చు . 91 సీఆర్పీసీ మేరకు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసిన పోలీసులు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నోటీసు అందజేసి ఒక గంట వ్యవధిలో అంటే 7 గంటలకు వెంకటాచలం వచ్చి వివరాలు చెప్పాలని పేర్కొన్నారు .
దీనిపై సోమిరెడ్డి తాజాగా స్పందించారు. గంట సమయంలో విచారణకు ఎలా హాజరు అవుతారని ప్రశ్నించారు. పైగా ఈ నెల మూడో తేదీన నోటీసు జారీ చేసినట్లు అందులో ఉండటంతో దానిని సరిచేయాలని సోమిరెడ్డి సూచించారు. అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎస్ఐ సోమవారం హాజరుకావాలని సోమిరెడ్డిని కోరారు. దీనికి ఆయన సమ్మతించారు. మొత్తానికి సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఫోర్జరీ కేసుతో ఆయన సైతం ఇప్పుడు చిరాకు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications