మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య: మహిళతో సన్నిహితంగా!
నిజామాబాద్: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న దేవేందర్(19) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఉన్న మంత్రి కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

Recommended Video
ఈ ఘటనపై ఆర్మూర్ ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ.. మృతి చెందిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ఆత్మహత్యకు ముందు తాను చనిపోతున్నట్లు యువకుడు ఆమెకు సందేశం పంపించినట్లు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, మంత్రి కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications