మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య: మహిళతో సన్నిహితంగా!
నిజామాబాద్: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న దేవేందర్(19) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఉన్న మంత్రి కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
Recommended Video
ఈ ఘటనపై ఆర్మూర్ ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ.. మృతి చెందిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ఆత్మహత్యకు ముందు తాను చనిపోతున్నట్లు యువకుడు ఆమెకు సందేశం పంపించినట్లు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, మంత్రి కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది.