మరో రెండు మృతదేహాలు లభ్యం.. మొత్తం 38... మిగిలినవి 11
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. ఓవైపు బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగానే మరోవైపు మృతదేహాలు కొట్టుకువస్తున్నాయి. ఈనేపథ్యంలోనే గురువారం నాలుగు మృతదేహాలు దవళేశ్వరం బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చాయి. దీంతో బయటకు తీసిన అనంతరం వారిలో ఇద్దరు బోటు ప్రమాదంలో చనిపోయిన పవన్కుమార్ మరియు భవానిలుగా గుర్తించారు. వీరు ఇద్దరు కూడ హైదరాబాద్కు చెందిన వారు. మరోవైపు ధవళేశ్వం లభించిన మరో రెండు మృత దేహాల ఆచూకి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 38 కి చేరింది.
సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నాట్లు అధికారులు తెలిపారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తుండగా రోజుకో శవం బయటపడుతోంది. మరోవైపు ప్రమాద స్థలంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడతో గాలింపు చర్యలకు బ్రేక్ పడుతోంది.

ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే సహాయక చర్యలు చేపట్టిన , నేవీతో పాటు ఇతర సహాయక బృందాలు వెనక్కి వెళ్లాయి. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి తీసుకువచ్చే ప్రయత్నాలకు రహాదారి అడ్డుగా మారింది. దీంతో సాంప్రదాయ పద్దతిలో బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే...కాగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు ప్రమాదంలో ఇంకా పదకొండు మంది ఆచూకి కోసం సహయక బృందాలు గాలిస్తున్నాయి.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications