క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు: గుండెపోటుతో క్షణాల్లోనే మృతి
సిద్దిపేట: ఇటీవల కాలంలో గుండెపోటు, కార్డియాక్ అర్టెస్టుతో ఆకస్మికంగా మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్టుతో పలువురు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఓ యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కేఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ క్రమంలో మైదానంలో బౌలింగ్ వేస్తున్న శనిగరం ఆంజనేయులు(37) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు.

యువకుడు కుప్పకూలిన వెంటనే అక్కడున్నవారు సీపీఆర్ చేసి.. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధరించారు. అప్పటి వరకు ఉత్సాహంగా తమతో క్రికెట్ ఆడిన ఆంజనేయులు.. ఆకస్మికంగా మరణించడంతో తోటి ఆటగాళ్లు, మిత్రులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలో కూడా ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు పరమేశ్ యాదవ్ అనే యువకుడు. గమనించిన తోటి ఆటగాళ్లు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరమేశ్ మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. అంతకుముందు ఫిబ్రవరి నెలలో విశాల్ అనే కానిస్టేబుల్ జిమ్లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. వీరంతా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్తోనే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications