ఓటేసీ చనిపోయిన వృద్దురాలు.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ బట్టి అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. టీడీపీకి చెందిన వారు తక్కువ మొత్తంలో ఉన్నారు. అర్ధరాత్రి వరకు ఫస్ట్ ఫేజ్ పంచాయతీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది.
పంచాయతీ ఎన్నికల్లో అందరి లాగానే ఓ వృద్దురాలు ఓటు వేశారు. ఇంటికొచ్చిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం ఫోక్స్ దర్ పేటకు చెందిన గొలివి గోవిందమ్మ (90) అనే వృద్ధురాలు ఎన్నికల్లో ఓటు వేసి.. ఇంటికి చేరుకుంది. అనంతరం అస్వస్థతకు గురైన మృతి చెందింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాల్లో గల 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది.
మరో రెండు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఇంతలో జడ్పీ ఎన్నికలను కూడా నిర్వహించాలని ఆయన అనుకుంటున్నారు. కానీ దీనిపై అధికార వైసీపీ ఎలాంటి వ్యుహం అనుసరిస్తుందో చూడాలీ.