2007 మక్కా మసీదు పేలుళ్లు: ఎప్పుడేం జరిగింది?
హైదరాబాద్: మక్కా మసీదు పేలుడు కేసులో నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించనుంది. పదకొండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చదవండి: మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత: నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు, భారీ బందోబస్తు
2007 మే 18న మధ్యాహ్నం 1.15 గం.ల సమయంలో మక్కా మసీదు ఆవరణలోని వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. 58 మంది గాయపడ్డారు. సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మే 18, 2007 : మక్కా మసీదులో పేలుడు చోటు చేసుకొని 9 మంది మృతి చెందారు. 58 మంది గాయపడ్డారు.
జూన్ 2010: ఈ కేసులో సీబీఐ నిందితుల ఛార్జీషీట్లో సునీల్ జోషి పేరు ఉంది. 29 డిసెంబర్ 2007లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అతను చనిపోయాడు.
నవంబర్ 19, 2010: హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) సీబీఐ అరెస్ట్ చేసింది. దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసింది.
డిసెంబర్ 18, 2010: మక్కా మసీదు పేలుడు ఘటనలో తన పాత్రను అసీమానంద అంగీకరించాడు.
2011 డిసెంబర్ 3: గుజరాత్ వల్సాద్కు చెందిన భారత్ మోహన్లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్భాయి అరెస్ట్.
ఏప్రిల్ 2011: ఈ కేసు విచారణ సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ - నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) బదలీ అయింది.
2013 మార్చి 2: మధ్యప్రదేశ్కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ పోలీసులకు చిక్కాడు.
మార్చి 23, 2017: హైదరాబాద్ కోర్టు అసీమానందకు బెయిల్ ఇచ్చింది. ఏడేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు.
మార్చి 31, 2017: అసీమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు
ఏప్రిల్ 16, 2018: ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నిందితులపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. దీంతో ఐదుగురు నిందితులపై కేసు కొట్టివేశారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications