అక్రమ చొరబాట్లు: రోహింగ్యాల అరెస్ట్, వారికి ఆధార్, పాస్ పోర్ట్కూడా
హైదరాబాద్: అక్రమంగా దేశంలోకి చొరబడిన ముగ్గురు మహిళలతోపాటు ఐదుగురు రోహింగ్యాలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారు అక్రమంగా చొరబడటంతోపాటు తప్పుడు వివరాలతో ఆధార్ కార్డు, పాస్ పోర్టు కూడా సంపాదించారని పోలీసులు తెలిపారు.
పక్కా సమాచారంతో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. 25-45ఏళ్ల మధ్య వయస్సున్న ఐదుగురు రోహింగ్యాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాము భారతీయులమని చెప్పి, తప్పుడు సమాచారంతో పొందిన ఐదు ఆధార్ కార్డులు, రెండు భారత పాస్పోర్టులు పోలీసులు సీజ్ చేశారు.

ఈ రోహింగ్యాలు కొన్ని సంవత్సరాల క్రితమే భారతదేశంలోకి చొరబడ్డారు. బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ ద్వారా కోల్కతాలోకి ఆ తర్వాత ఢిల్లీకి, అక్కడ్నుంచి హైదరాబాద్ వచ్చి జహీరాబాద్లో స్థిరపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ట
ఆ ఐదుగురికీ ఆధార్ కార్డులున్నాయని, వారిలో ఇద్దరికి ఇండియన్ పాస్ పోర్టు కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 420 తోపాటు పాస్ పోర్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఐదుగురిని కోర్టులో ప్రవేశపెట్టగా.. వీరికి జుడీషియల్ కస్టడీ విధించిందని పోలీసులు తెలిపారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications