60లక్షల ప్యాకేజీ దక్కించుకున్న బీటెక్ విద్యార్థిని
హైదరాబాద్: ఇటీవల చాలా మంది విద్యార్థినీ, విద్యార్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలను ప్రదర్శించి ప్రముఖ కంపెనీల్లో ఉన్నతమైన ఉద్యోగాలు పొందుతున్న విషయం తెలిసిందే. అంతేగాక వారి వేతన ప్యాకేజీలు కూడా భారీగానే ఉంటున్నాయి. కాగా, బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేసిన ఓ విద్యార్థిని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది.
ఆమె అందుకునే జీతం కూడా భారీగానే ఉంది. రూ. 60 లక్షల పైచిలుకు వార్షిక వేతన ప్యాకేజీతో ఆమె జాక్పాట్ కొట్టేసింది. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ నగరానికి చెందిన బ్రహ్మదేవుల నిఖిత కేరళలోని కొల్హాంలోని అమృత విశ్వవిద్యాపీఠంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో బీటెక్ చదువుతోంది.

ఆన్లైన్ ఎగ్జామ్రాసిన నిఖిత అమెజాన్ కంపెనీలో ఐటీ ఆపరేషన్స్ ప్రొగ్రాం మేనేజర్గా ఉద్యోగం సంపాదించింది. ఇంతకు ముందు నిఖిత గూగూల్, సిస్కొ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు అందుకుంది. నిఖిత తండ్రి రమేష్కుమార్ ఇంజినీర్గా పనిచేస్తుండగా, తల్లి సునితారాణి గృహిణిగా ఉంటూ నిఖితను ప్రోత్సహించారు.
సెయింట్ గ్రాబ్రియల్ హైస్కూళ్లో పాఠశాల విద్యనభ్యసింంచిన నిఖిత.. నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. నిఖిత భారీ వేతన ప్యాకేజీని సొంతం చేసుకోవడం పట్ల నిఖిత తల్లిదండ్రులతోపాటు కాలేజీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications