తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, ముగ్గురు మృతి: జిల్లాలవారీగా కేసుల వివరాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనావైరస్ కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా కొత్త కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 1,14,105 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 638 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.
తెలంగాణలో కొత్తగా 638 కరోనా కేసులు, 3 మరణాలు
తాజాగా, నమోదైన 638 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,41,791కు చేరింది. కరోనాతో కొత్తగా ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3787కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.
తెలంగాణలో 9,325 యాక్టివ్ కేసులు
గత
24
గంటల్లో
తెలంగాణ
రాష్ట్రంలో
715
మంది
కరోనా
నుంచి
కోలుకున్నారు.
దీంతో
ఇప్పటి
వరకు
కరోనా
మహహ్మారి
నుంచి
సురక్షితంగా
బయటపడినవారి
సంఖ్య
6,28,679కి
చేరింది.
ప్రస్తుతం
రాష్ట్రంలో
9,325
యాక్టివ్
కేసులున్నాయి.
రాష్ట్రంలో
రికవరీ
రేటు
97.95
శాతానికి
తగ్గింది.
గత
24
గంటల్లో
నమోదైన
కరోనా
కేసుల
కంటే
రికవరీలు
ఎక్కువగా
ఉండటంతో
యాక్టివ్
కేసుల్లో
క్షీణత
నమోదైంది.
Recommended Video
తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 04, భద్రాద్రి కొత్తగూడెంలో 33, జీహెచ్ఎంసీలో 59. జగిత్యాలలో 28, జనగామలో 07, జయశంకర్ భూపాలపల్లిలో 05, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 02, కరీంనగర్లో 65, ఖమ్మంలో 62, కొమురంభీం ఆసిఫాబాద్ లో 02, మహబూబ్నగర్లో 09, మహబూబాబాద్లో 17, మంచిర్యాలలో 24, మెదక్లో 02, మేడ్చల్ మల్కాజ్గిరిలో 32, ములుగులో 05, నాగర్ కర్నూలులో 04, నల్గొండలో 37, నారాయణపేటలో 00, నిర్మల్లో 02, నిజామాబాద్లో 03, పెద్దపల్లిలో 45, రాజన్న సిరిసిల్లలో 25, రంగారెడ్డిలో 19, సంగారెడ్డిలో 07, సిద్దిపేటలో 10, సూర్యాపేటలో 22, వికారాబాద్ లో 02, వనపర్తిలో 03, వరంగల్ రూరల్లో 16, వరంగల్ అర్బన్లో 66, యాదాద్రి భువనగిరిలో 20 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, నారాయణపేట్ జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసూ నమోదు కాలేదు.