తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి...
తెలంగాణలో కొత్తగా 721 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 684 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (డిసెంబర్ 9) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,261కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1480కి చేరింది. ప్రస్తుతం 7,661 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 5576 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 753 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,66,120కి చేరింది.
గడిచిన 24గంటల్లో మొత్తం 51,402 శాంపిల్స్ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 59,19,635కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,59,044 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 94.6శాతం ఉండగా తెలంగాణలో 96.67శాతం ఉన్నట్లు తెలిపారు.
Recommended Video
తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 123, రంగారెడ్డి జిల్లాలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం(డిసెంబర్ 7) రాష్ట్రంలో 517 కరోనా పాజిటివ్ కేసులు,మంగళవారం (డిసెంబర్ 8) 682 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.