దంపతులపై పట్టపగలే వేటకొడవళ్లతో దాడి: భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం నాగసాలలో పట్టపగలే దారుణ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై ఆటోలో వచ్చిన నలుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు.
మహబూబ్నగర్: జిల్లాలోని జడ్చర్ల మండలం నాగసాలలో పట్టపగలే దారుణ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై ఆటోలో వచ్చిన నలుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు.
వేట కొడవళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా నరకడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, బాధితులు నాగర్కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం కేంద్రానికి చెందిన వెంకటయ్య, సుజాతగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Comments
English summary
A couple attacked by four thugs in Mahabubnagar district. in this incident husband died and wife seriously injured.
Story first published: Tuesday, September 12, 2017, 18:06 [IST]