వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెను విషాదం: ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అప్పులబాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య తెలిసింది.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలోని స్థానిక కస్తూరి బజార్‌లో నివాసం ఉంటున్న బాధిత కుటుంబం గత కొంతకాలం నుంచి ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

A family committed suicide in Suryapet

సోమవారం ఉదయం స్థానికులు గమనించేసరికి వారు విగతజీవులుగా కనిపించారు.
మృతులలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను కస్తూరి జనార్దన్ (59), చంద్రకళ(50), ప్రభాత(3౦), అశోక్(25), సిరి(5) రుత్విక (2)లుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

English summary
A family allegedly committed suicide in Suryapet district due to debts problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X