హృదయవిదారకం: సెల్ టవర్పై ఉరేసుకుని రైతు ఆత్మహత్య, పిల్లలు ఏడుస్తున్నా..
కామారెడ్డి: జిల్లాలోని లింగంపేట మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే 35 ఏళ్ల రైతు సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పిల్లలు కన్నీళ్లు పెడుతున్నా.. ఆ రైతు తని నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ హృదయ విదారక ఘటన అక్కడివారిని కలిచివేసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు సమీపంలోని తన భూమి మీదుగా పంట కాలువ నీరు వెళ్తుండటంతో పరిహారం చెల్లించాలని గత నాలుగేళ్లుగా అధికారులు, గ్రామస్తులకు మొరపెట్టుకున్నాడు. అయితే, రెండు సంవత్సరాల క్రితం అప్పటి తహసీల్దార్ అమీన్ సింగ్ ఆయన భూమికి వెలకట్టి రూ. 2 వేలు పరిహారంగా చెల్లించారు.

గత సంవత్సరం గ్రామ రైతులు చెరువు కింద పంటలు సాగు చేయలేదు. కానీ, ఈ ఆదివారం రైతులు చెరువు సమీపంలో పంటలు సాగు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో తన భూమి మీదుగా మళ్లీ నీరు వెళ్తుందని మనస్తాపం చెందారు ఆంజనేయులు. ఈ క్రమంలోనే సోమవారం సెల్ఫోన్ టవర్ ఎక్కిన ఆంజనేయులు.. ఎస్సై శంకర్, తహసీల్దార్ మారుతితో ఫోన్లో మాట్లాడారు. వారు ఎంత సర్దిచెప్పినా ఒప్పుకోలేదు. ఎస్పీ, డీఎస్పీ ఇక్కడికి రావాలని పట్టుబట్టారు.
సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఎంత చెప్పినా వినలేదు. తువ్వాలుతో సెల్ టవర్కు ఉరేసుకుని అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆంజనేయులు. అతని పిల్లలు కూడా వద్దు డాడీ అంటూ ఏడ్చినా కూడా అతడు తన కఠిన నిర్ణయాన్ని విరమించుకోలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఆర్డీవో శ్రీను నాయక్, డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆంజనేయులు మృతదేహాన్ని కిందికి దించి, పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులు ఆత్మహత్యతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆంజనేయులు మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications