నీ భర్తకు చెబుతా.!: ఆమెకు ఇద్దరితో సాన్నిహిత్యం, ఒకరితో మరొకరిని చంపించి.. తానూ ఆత్మహత్య
గద్వాల: ఆ యువతికి అప్పటికే వివాహమైంది. అయితే, ఆమెకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆమె భర్తకు, అత్తింటివారికి చెబుతానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె అతడ్ని హత్య చేయించింది. అయితే, ఈ విషయం బయటపడేసరికి ఏం చేయాలో తెలియని స్థితిలో బలవన్మరణానికి పాల్పడిందా వివాహిత. దీంతో ఇద్దరి జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి. ఈ ఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.

ఇద్దరితో స్నేహంగా..
ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను గద్వాల డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ హనుమంతు మీడియాకు వెల్లడించారు. గద్వాలలోని బురదపేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కార్తీక్(31) . గద్వాలకు చెందిన రాగసుధ వివాహం అనంతరం మహూబ్నగర్లో స్థిరపడింది. అయితే, కాలేజీలో తనతోపాటు చదివిని కార్తీక్ ఆమెతో తరచూ మాట్లాడేవాడు. తన సూపర్ సీనియర్ అయిన రవితో కూడా ఆమె సన్నిహితంగా ఉండేది.

బెదిరించడంతో కార్తీక్ను చంపించింది..
కాగా, కార్తీక్, రాగసుధల మధ్య ఇటీవల మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో తమ పరిచయం సంగతి ఆమె భర్తకు, కుటుంబసభ్యులకు చెబుతానని పలుమార్లు కార్తీక్ అమెను బెదిరింపులకు గురిచేశాడు. దీంతో కార్తీక్ను ఎలాగైనా తుదముట్టించాలనుకుంది. రవితో కలిసి కార్తీక్ హత్యకు ప్లాన్ వేసింది. రవి, అతడి స్నేహితులు అనిల్, రంజిత్, వసంత్, వీరేశ్, భీం, సునీల్, ఉదయ్ కలిసి ఫిబ్రవరి 24-25 తేదీల మధ్య కార్తీక్ను గద్వాల సమీపంలోని నదీ ఆగ్రహారం వద్దకు తీసుకెళ్లారు. కార్తీక్కు మద్యం తాగించి ఆ తర్వాత ఇనుపరాడ్లతో కొట్టి చంపారు.

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
అనంతరం కార్తీక్ మృతదేహాన్ని కారులో కొండపల్లి గుట్టలపైకి తీసుకెళ్లి అక్కడే పాతిపెట్టి పరారయ్యారు. కార్తీక్ మృతదేహం శుక్రవారం బయటపడటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో తన పేరు బయటపడుతుందనే భయంతో రాగసుధ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో కార్తీక్ హత్య కేసులో నిందితులైన రవి, అనిల్, వసంత్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరో నిందితుడు ఉన్నాడంటూ కార్తీక్ తల్లిదండ్రులు..
కాగా, రాగసుధ ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన ఏడు పేజీల సూసైడ్ నోట్ను, ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్న మహబూబ్నగర్ పోలీసులు గద్వాల జిల్లా పోలీసులకు అందించారు. తమ కుమారుడి హత్యపై తమకు అనుమానాలున్నాయని, రవితోపాటు అజయ్ అనే వ్యక్తి కూడా నిందితుల్లో ఉన్నారని, అతడ్ని ఎందుకు కేసులో చేర్చలేదని కార్తీక్ తల్లిదండ్రులు పోలీసులను ప్రశ్నించారు. తమ కుమారుడి హత్య కారణమైనవారందర్నీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications