జీడిమెట్ల ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ శబ్ధంతో పేలుడు ఘటన కలకలం రేపింది. జీవిక లైఫ్ అనే ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో కంపెనీ పైకప్పు తునాతునకలైంది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పేలుడుతో ఎగిసిపడిన మంటలను అగ్నిమాపక దళాలు అదుపులోకి తీసుకొచ్చాయి.

కాగా, ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 20మంది కార్మికులు పనిచేస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయంపై వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్నప్పటికీ అక్కడి కంపెనీలు, పరిశ్రమలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలున్నాయి. తరచూ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇలాంటి ప్రమాదాలు జరగడంపై అక్కడి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఆటోను డీకొన్న కారు: ఐదుగురు మృతి
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడపల్లి మండలం రాణాకలాన్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా కారు ఢీకొనడటంతో ఆటోలోని ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో జక్కం బాలమణి, జక్కం గంగమ్మ, కల్లేపురం సాయిలు, చిక్కెల సాయిలు, ఆటో డ్రైవర్ నయీం ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications