విద్యార్థినికి మత్తు మందిచ్చి లైంగికదాడి: టీచర్పై నిర్భయ కేసు నమోదు
నల్గొండ/ఆదిలాబాద్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని మంచి మార్గంలో నడపాల్సిన బాధ్యత ఉన్న ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తండ్రిగా భావించి వెంటవవచ్చిన ఓ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కోదాడ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సదరు బాలిక, మునగాల మండలం ఆకుపాముల శివారులోని బెతానియ క్రైస్తవ పాఠశాలలో పదోతరగతి చదువుతోంది.
పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్న బొబ్బిలి రాజు ఆగస్టు 15న స్టడీమెటీరియల్ ఇస్తానని నమ్మబలికి ఆమెను బైక్పై కొమరబండకు తీసుకెళ్లాడు. మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మెలుకువ వచ్చిన తర్వాత ఈ విషయం ఎవ్వరికైనా చెబితే అంతుచూస్తానని ఆమెను బెదిరించాడు.
కాగా, బాలిక సోమవారం బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. సమాచారం అందుకున్న బాలిక తల్లి కోదాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నీట మునిగి నలుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం నీటమునిగి నలుగురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతంలో సోమవారం ఇద్దరి మృతదేహాలు లభించాయి. మృతులు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దోమకొండకు చెందిన అన్నదమ్ములు చెన్నూరి సంతోష్(26), అంబాదాస్(22)గా గుర్తించారు.
చీరల వ్యాపారం చేసే వీళ్లు శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. రెండు రోజులుగా కుంటాల జలపాతం సమీపంలో వీరి బైక్ నిలిపి ఉండటంతో... ఇక్కడే వీరి కోసం గాలించారు. సోమవారం ఇద్దరి మృతదేహాలు నీటిపై తేలాయి.
కాగా, సంతోష్కు భార్య, కూతురు ఉన్నారు. మరోఘటనలో నిర్మల్ రూరల్ గాజులపేట్ వైయస్సార్ కాలనీకి చెందిన స్నేహితులు హైమద్ (20), సులేమాన్ (19) సోమవారం కాలనీ సమీపంలోని పల్లెచెరువులో స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతిచెందారు.