మంచు పర్వతం నుంచి జారిపడి తెలుగు జవాన్ మృతి

శ్రీనగర్/ఆదిలాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఓ తెలుగు జవాను మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన వైశాక సంతోష్(28) రెండు రోజుల క్రితం మంచు పర్వతంపై నుంచి జారిపడి మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

ఈ మేరకు సంతోష్ కుటుంబసభ్యులకు ఆదివారం ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మృతదేహం మంచులో కూరుకుపోవడంతో.. బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.

A telugu jawan killed in ladakh

అనంతరం లేహ్ వరకూ తీసుకొచ్చినా అక్కడి నుంచి తరలించలేని పరిస్థితి ఎదురైందని తెలిపారు. అయితే, సోమవారం సాయంత్రానికల్లా కాగజ్‌నగర్‌కు మృతదేహాన్ని చేర్చేందుకు కృషి చేస్తామని అధికారులు చెప్పారు.

కాగజ్‌నగర్‌లోని నౌగాంబస్తీకి చెందిన వైశాక భీమన్న-మణెమ్మ దంపతులు పెద్ద కుమారుడైన సంతోష్ 2005లో భారత సైన్యంలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+