ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచు పర్వతం నుంచి జారిపడి తెలుగు జవాన్ మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్/ఆదిలాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఓ తెలుగు జవాను మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన వైశాక సంతోష్(28) రెండు రోజుల క్రితం మంచు పర్వతంపై నుంచి జారిపడి మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

ఈ మేరకు సంతోష్ కుటుంబసభ్యులకు ఆదివారం ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మృతదేహం మంచులో కూరుకుపోవడంతో.. బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.

A telugu jawan killed in ladakh

అనంతరం లేహ్ వరకూ తీసుకొచ్చినా అక్కడి నుంచి తరలించలేని పరిస్థితి ఎదురైందని తెలిపారు. అయితే, సోమవారం సాయంత్రానికల్లా కాగజ్‌నగర్‌కు మృతదేహాన్ని చేర్చేందుకు కృషి చేస్తామని అధికారులు చెప్పారు.

కాగజ్‌నగర్‌లోని నౌగాంబస్తీకి చెందిన వైశాక భీమన్న-మణెమ్మ దంపతులు పెద్ద కుమారుడైన సంతోష్ 2005లో భారత సైన్యంలో చేరారు.

English summary
A telugu jawan, who is belongs to adilabad district killed in ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X