దారుణం: గదిలో నిర్బంధించి సహోద్యిగినిపై అత్యాచారం
హైదరాబాద్: సహోద్యోగే కాదా అని కొంత చనువుగా ఉంటే ఓ ప్రబుద్ధుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పని ఉందంటూ పై అంతస్తుకు తీసుకెళ్లి నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన బంజారాహిల్స్లో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెం.11లోని ఓ ప్రైవేటు సంస్థ హౌజ్కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న యువతిపై శనివారం అక్కడే పనిచేస్తున్న దుర్గాప్రసాద్ (25) అత్యాచారం చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
శుభ్రం చేసే పని ఉందంటూ ఆమెను నాల్గో అంతస్తులోని గదికి తీసుకెళ్లి గడియ పెట్టి అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ఉదంతంపై శనివారం రాత్రి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.