ఉద్యోగమిచ్చి.. మహిళా మేనేజర్పై యజమాని, స్నేహితుల గ్యాంగ్రేప్
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్కెటింగ్ మేనేజర్గా పనిచేసే ఓ ఉద్యోగినిపై ఆ సంస్థ యజమాని, మరో ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు సెప్టెంబర్ 25న కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రేప్ విషయం బయటకు చెపితే చంపేస్తానని ఆ ముగ్గురు నిందితులు బెదిరించారని బాధితురాలు కోర్టుకు తెలిపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హబ్సిగూడలోని ఫార్చున్ బట్టర్ ఫ్లై సిటీ కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగం ఉందని తెలిసి బాధితురాలు దరఖాస్తు చేసుకుంది.
ఇంటర్వ్యూ చేసిన సంస్థ యజమాని సంకు రమణ.. బాధితురాలికి ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత మాదాపూర్లో మరో బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని, అక్కడే పని చేయాల్సి ఉంటుందని మహిళకు చెప్పాడు.

దీంతో గత నవంబర్ నుంచి బాధితురాలు మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్తోంది. కాగా, ఆగస్టు 30వ తేదీన బాధితురాలిని అయ్యప్ప సొసైటీలోని ప్లాట్కు రమణరప్పించాడు.
ఆ తర్వాత అతని స్నేహితులు కిరణ్, రాజేశ్తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications