Crime News: హోలీ ఆడడానికి వెళ్లి శవంగా మారిన యువకుడు..
మేడ్చల్ జిల్లా దుండిగల్ లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.
హోలీ ఆడడానికి వెళ్లిన యువకుడు శవమై కనిపించిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక రాజీవ్ గృహకల్పలో వినయ్ అనే యువకుడు తల్లి పాటు నివాసిస్తున్నాడు. ఈ నెల 8న హోలీ అడడానికి వెళ్లాడు. సాయంత్రం గాయాలతో ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే అతని నలుగురు స్నేహితులు వచ్చి వినయ్ రాలేను అంటుండగానే బలవంతంగా తీసుకెళ్లినట్లు మృతుడి తల్లి చెప్పింది.
అతను ఆ రోజు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి వెతకడం మొదలు పెట్టారు. ఇంతలో జ్యోతి మిల్క్ పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో వినయ్ విగతజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు విచారణ ప్రారంభించారు.

వినయ్ గతంలో బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీస్ రికార్డులో ఉందని ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications