జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెల్‌ఫోన్ కొనివ్వలేదని.. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: జిల్లాలోని జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రోహిత్ (17)అనే యువకుడు గత కొంతకాలంగా సెల్‌ఫోన్ కావాలని అడుగుతున్నాడు.

దీనికి తల్లిదండ్రులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపనికి గురైన రోహిత్ బుధవారం ఇంట్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు గదిలోంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చూసే సరికి రోహిత్ మరణించి ఉన్నాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

A youth allegedly committed suicide for cellphone

విద్యుత్ షాక్‌తో అన్నదమ్ముల మృతి

వరంగల్: పొలంలో మోటార్ వేసేందుకు వెళ్లిన అన్నదమ్ములు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం గుడితండాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించడంతో తండాలో విషాదం నెలకొంది.

వాల్కి అనే మహిళ భర్తను కోల్పోవడంతో ముగ్గురు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి.. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతోంది. బుధవారం పొలంలో మోటార్ ఆనే చేసి రమ్మని తల్లి వాల్కి కుమారులైన సురేష్‌, నరేష్‌లను పంపింది.

అయితే, పొలంలో విద్యుత్ తీగ తెగి గట్టుపై పడిపోయింది. అది చూసుకోకుండా వెళ్లిన పిల్లల కాళ్లకు ఆ తీగ తగలడంతో విద్యుత్ షాక్‌తో ఇద్దరూ మృతి చెందారు. పొలానికి వెళ్లిన పిల్లలు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి తల్లి వాల్కీ వెళ్లి చూసింది. ఇద్దరు పిల్లలు విగతజీవులుగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది.

English summary
A youth allegedly committed suicide in Karimnagar district for cellphone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X