ఇక ఆపండి.. 'స్వామి గౌడ్' విషయంలో మాది పొరపాటే: ఏబీఎన్
హైదరాబాద్: మండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటి గాయం చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. పరిస్థితి కార్నియా దెబ్బతినేదాకా వెళ్లిందని టీఆర్ఎస్ అంటుంటే.. అబ్బే అదంతా వట్టి డ్రామా అని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. ఇలాంటి తరుణంలో.. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కొన్ని దృశ్యాలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి.

ఏబీఎన్ వీడియోలో ఎడమ కన్ను?..
స్వామిగౌడ్ కుడి కన్నుకు గాయమైతే.. ఏబిఎన్ ప్రసారం చేసిన వీడియోలో మాత్రం ఎడమ కన్నుకు గాయమైనట్టుగా కనిపించింది. దీంతో కేసీఆర్ స్వామి గౌడ్తో నిజంగానే డ్రామా ఆడిస్తున్నాడా?.. ఒక టీవి చానెల్లో కుడి కన్నుకు మరో టీవి చానెల్లో ఎడమ కన్నుకు గాయమైనట్టు కనిపించడమేంటి? అన్న ప్రశ్నలు తలెత్తాయి.

ఏబీఎన్ వివరణ..:
స్వామి గౌడ్ కంటి గాయంపై ఏబీఎన్ ప్రసారం చేసిన దృశ్యాలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కాంగ్రెస్ చెప్పిందే కరెక్ట్ అని టీఆర్ఎస్ డ్రామా ఆడుతుందని కొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇంతలో తప్పు గుర్తించారో ఏమో కానీ ఏబీఎన్ నుంచి వివరణ రానే వచ్చింది.

మిర్రర్ ఎఫెక్ట్ వల్లే.. ఆ తప్పిదం:
వాస్తవానికి స్వామి గౌడ్ కుడి కన్నుకే గాయమైందని.. సాంకేతిక తప్పిదం కారణంగా ఎడమ కన్నుకు గాయమైనట్లు ఏబీఎన్లో ప్రసారమైందని ఆ చానెల్ వివరణ ఇచ్చింది. మిర్రర్ ఎఫెక్ట్ వాడటం వల్లే ఇలా జరిగిందని తెలిపింది.

వార్తల్లో మాత్రం కుడికన్ను అనే..:
ఏబీఎన్ ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగ్స్తో కొంతమంది సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రచారాలు చేస్తున్నారని, ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నట్టు ఏబీఎన్ విజ్ఞప్తి చేసింది. పొరపాటును గుర్తించిన తక్షణమే సరిదిద్దామని, వీడియో క్లిప్పింగ్స్ లో ఎలా ఉన్నా.. వార్తల్లో మాత్రం కుడి కన్నుకే గాయమైందని చెప్పామని వెల్లడించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications