రేవంత్ వ్యక్తిగత సిబ్బందికీ ఏసీబీ నోటీస్: ఎవరీ జిమ్మి? లోకేష్తో..(పిక్చర్స్)
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రేవంత్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. వారి వాంగ్మూలాలను నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేశారు. వారిని సాక్షులుగా చేర్చనున్నారని తెలుస్తోంది. నలుగురికి నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే ఏసీబీ సండ్ర వెంకట వీరయ్యకు ఆదివారం నాడు మరోసారి నోటీసులు ఇచ్చింది. అలాగే, సెబాస్టియన్ స్నేహితుడైన జిమ్మీకి ఇచ్చింది. సండ్ర ఈ నెల 6న బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5లోగా విచారణ నిమిత్తం హాజరు కావాలని అదనపు ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసుకు సంబంధించి తెలిసిన విషయాలు, ఆ కేసుతో ఉన్న సంబంధాల వివరాలను తెలియజేయాలని కోరింది. ఈ తాఖీదులను సండ్ర నివాసానికి చెందిన గోడకు అతికించారు. ఓటుకు నోటు కేసు నిందితులతో సండ్రకు ఉన్న సంబంధాలపై విచారించడానికి సిద్ధమయ్యారు.
సీఆర్పీసీ సెక్షన్ 41(ఎ) కింద తాఖీదులు జారీ అయినపుడు తగిన కారణాలున్నట్లయితే అరెస్ట్ చేయడానికి అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. తాఖీదులు జారీ అయిన నేపథ్యంలో ఏసీబీ నిర్దేశించిన గడువులోగా హాజరవుతానని, వారికి విచారణకు సహకరిస్తానని సండ్ర చెప్పారు.

జిమ్మీ బాబు మిత్ర మండలి
స్టీపెన్ సన్ వాంగ్మూలంలో జిమ్మీ అనే వ్యక్తి వచ్చి తనను సెబాస్టియన్ వచ్చి కలుస్తాడని చెప్పిన అంశంపై ఏసీబీ విచారణకు నిర్ణయించింది.

టీడీపీ నేతలతో జిమ్మీ
ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో రెండు నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ స్నేహితుడైన జిమ్మీకి కూడా ఏసీబీ తాఖీదులు జారీ చేసిందని తెలుస్తోంది.

టీడీపీ నేతలతో జిమ్మీ
ఫిర్యాదుదారు అయిన ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను సెబాస్టియన్ను, మత్తయ్య జెరూసలేంను పరిచయం చేసింది జిమ్మీయేనని ఏసీబీ దర్యాప్తులో తేలిందని సమాచారం

టీడీపీ నేతలతో జిమ్మీ
ఈ నేపథ్యంలో జిమ్మీని విచారించి ఏ నేపథ్యంలో పరిచయం చేసింది, కేసుకు సంబంధించి ఇతర వివరాలేమైనా ఉన్నాయా అన్న అంశాలపై ఆరా తీయనున్నారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications