Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేటీఆర్ కు నోటీసులు.. కవిత కీలక కామెంట్స్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు మరోసారి నోటీసులు అందాయి. ఫార్ములా- ఈ కేసులో భాగంగా విచారణకు జూన్ 16న హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూన్ 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు.

అయితే ఏసీబీ ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. జూన్ 16న విచారణకు వస్తున్నట్లు తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా ఏసీబీ అధికారుల ముందు హాజరవుతానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఏసీబీ విచారిస్తోందని ఎద్దేవా చేశారు. ఇద్దరం లై డిటెక్టర్ టెస్టుకు వెళ్దామా..? అని సవాల్ విసిరారు.

ACB Targets KTR Notices Issued to Former Minister Kavitha Fires Back with Key Remarks

అయితే కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని ఆమె ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజా క్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని అన్నారు.

మరోవైపు జూన్ 11న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు అయ్యారు. కమిషన్ సంధించిన 18 ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. దాదాపు గంట పాటు ఆయనను విచారించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. జూన్ 11న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విచారణ ప్రారంభం అయింది. ఆ సమయంలోనే కేసీఆర్ స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్ అంగీకరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+