అతను రేప్ చేయబోయాడు, చెప్పులే పట్టిచ్చాయి: డిసిపి
మేడ్చల్: తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఎల్లంపేట గ్రామంలో ఇందు శ్రీసాయి ప్రసన్నలక్్మి హత్య కేసులో నిందితుడి వివరాలు డిసిపి సాయికుమార్ వెల్లడించారు. నిందితుడు చోరి చేయడానికి ఇంట్లోకి ప్రవేశించాడని, ఆ సమయంలో బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిచాడని ఆయన శనివారం చెప్పారు.
చెప్పుల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. బాలికను చంపేసి, ఆస్పత్రికి తరలించాడని ఆయన చెప్పారు. ఎల్లంపేట గ్రామానికి చెందిన ఓ బాలుడు హత్యచేశారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన విషయం తెలిసిందే.
షేవింగ్ బ్లేడ్తో గొంతు, మణికట్టు కోసి అతను లక్ష్మిప్రసన్నను దారుణంగా హత్య చేశాడు. ఇందు శ్రీసాయి ప్రసన్న లక్ష్మి ఇంటి సమీపంలోనే ఆ బాలుడు ఉంటాడు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బాలుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించారు.
మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేటలో బుధవారం మధ్యాహ్నం 3.40 గంటలకు భవానీ-కృష్ణమూర్తిల రెండో కూతురు శ్రీసాయి లక్ష్మీప్రసన్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మీప్రసన్నను బ్లేడుతో గొంతు కోసి ఎడమ చేయి మణికట్టును కూడా తెగనరికి బాత్రూంలో పడేశాడు.