హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతను రేప్ చేయబోయాడు, చెప్పులే పట్టిచ్చాయి: డిసిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

మేడ్చల్: తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఎల్లంపేట గ్రామంలో ఇందు శ్రీసాయి ప్రసన్నలక్్మి హత్య కేసులో నిందితుడి వివరాలు డిసిపి సాయికుమార్ వెల్లడించారు. నిందితుడు చోరి చేయడానికి ఇంట్లోకి ప్రవేశించాడని, ఆ సమయంలో బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిచాడని ఆయన శనివారం చెప్పారు.

చెప్పుల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. బాలికను చంపేసి, ఆస్పత్రికి తరలించాడని ఆయన చెప్పారు. ఎల్లంపేట గ్రామానికి చెందిన ఓ బాలుడు హత్యచేశారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన విషయం తెలిసిందే.

Accused attempted to rape girl and killed at Ellampet

షేవింగ్ బ్లేడ్‌తో గొంతు, మణికట్టు కోసి అతను లక్ష్మిప్రసన్నను దారుణంగా హత్య చేశాడు. ఇందు శ్రీసాయి ప్రసన్న లక్ష్మి ఇంటి సమీపంలోనే ఆ బాలుడు ఉంటాడు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బాలుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించారు.

మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ మండలం ఎల్లంపేటలో బుధవారం మధ్యాహ్నం 3.40 గంటలకు భవానీ-కృష్ణమూర్తిల రెండో కూతురు శ్రీసాయి లక్ష్మీప్రసన్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మీప్రసన్నను బ్లేడుతో గొంతు కోసి ఎడమ చేయి మణికట్టును కూడా తెగనరికి బాత్రూంలో పడేశాడు.

English summary
The mystery of 8 year old girl Indu Sri sai lakshmi Prasanna's murder case is reveled in Medchel district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X