ఏపీ-తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిక్స్ : గ్రూపులకు అతీతంగా - ఏకపక్షంగా..!!
గ్రూపు రాజకీయాలు..ఆధిపత్య పోరుతో సతమతం అయ్యే తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ లో ఇప్పుడు వీటికి భిన్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ అధ్యక్ష వేళ..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏకాభిప్రాయం వినిపిస్తోంది. నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. 137 సంవత్సాల కాంగ్రెస్ చరిత్రలో ఆరోసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందునా గాంధీ కుటుంబం కాని వారు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకొనే పీసీసీ డెలిగేట్లకు క్యూ ఆర్ కోడ్ తో కార్డులు అందాయి. తెలంగాణ లో పార్టీ ప్రధాన కార్యాలయంలో గాంధీ భవన్ లో పోలింగ్ జరగనుంది.

రేవంత్ టీం మొత్తం ఏకపక్షంగా
ప్రదేశ్ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు రాజమోహన్ ఉన్నితన్, రాజ్ భఘేల్ పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ సాగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా టీపీసీసీ ఎలక్టెడ్ సభ్యులు 238 మంది ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే - శశి థరూర్ పోటీ పడుతున్నారు. తెలంగాణ - ఏపీ కాంగ్రెస్ నేతలకు ఖర్గేతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఖర్గేకు గాంధీభవన్లో ఘన స్వాగతం లభించింది.

కర్నూలు కేంద్రంగా ఏపీ కాంగ్రెస్
అయితే, ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన శశిథరూర్ ఇక్కడి ముఖ్య నాయకులను కలిసేందుకు ప్రయత్నించగా స్థానిక కాంగ్రెస్ నేతలు ముందుకు రాలేదు. ఖర్గేకు పోలింగ్ ఏజెంట్లుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మల్లు రవి వ్యవహరిస్తున్నారు. తనకు పోలింగ్ ఏజెంట్లుగా కాంగ్రెస్ సభ్యులు ఓ ఇద్దరిని థరూర్ నియమించుకున్నట్లు తెలిసింది. సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు బాహాటంగానే ఖర్గేకు మద్దతు ప్రకటించారు. ఇక, ఏపీలోనూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీ లో కాంగ్రెస్ డెలిగేట్లు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది పీసీసీ డెలిగేట్లు ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సర్వం సిద్దం
వారంతా కర్నూలుకు తరలి రానున్నారు. 22 ఏళ్ల తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కర్నూలు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ రోజు పర్యటించనున్నారు. ఇక, ఈ నెల 18వ తేదీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్నూలు జిల్లాలో జరిగే భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆయన యాత్ర కొనసాగనుంది. అయితే, ఏపీ -తెలంగాణలో ఖర్గేకు అనుకూలంగానే ఏకపక్షంగా ఓటింగ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
-
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications