Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాంపల్లిలో అఖిలపక్ష సమావేశం..! వలస కూలీల సహాయంపై టీ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న నేతలు..!!

హైదరాబాద్ : గులాబీ ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకులు మరోసారి మండిపడ్డారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వం నిరుపేదలకు, వలస కూలీలకు తగు న్యాయం చేయక పోగా తప్పుడు ప్రచారం చేస్తోందని అఖిలపక్షానికి హాజరైన నేతలు విమర్శించారు. నాంపల్లి ఎగ్సిబిషన్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో కరోనో వైరస్, ప్రభుత్వ చర్యల విషయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. టీటీడీపీ అధ్యక్షులు ఎల్. రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ పాల్గొన్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వ సహాయ చర్యలు ప్రకటనలకే పరిమితమయ్యాయని నేతలు ఘాటుగా విమర్శించారు.

కరోనా కష్టకాలం.. ప్రభుత్వ సహాయ చర్యలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్షం..

కరోనా కష్టకాలం.. ప్రభుత్వ సహాయ చర్యలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్షం..

కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు ఇతర సిబ్బంది కి అఖిలపక్షం తరుపున అభినందనలు తెలిపారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రజలు వైద్యులకు సహకారాన్ని అందించాలని, వారిపై దాడులు చేయడం సరికాదని కోదండరాం సూచించారు. లాక్ డౌన్ సమయంలో ప్రతిపక్షాల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే సరిపోదని, ఏరియా ఆస్పత్రిఅభివృద్ధి, 104,108 అంబులెన్స్ లను పునరుద్ధరించి రోగులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా మానవత్వంతో ఉపాది కోల్పోయిన ప్రతి ఒక్కరికి రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.

టీ సర్కార్ తప్పుడు లెక్కలు.. వలస కూలీలకు ఎంతిచ్చారో చెప్పాలన్న నేతలు..

టీ సర్కార్ తప్పుడు లెక్కలు.. వలస కూలీలకు ఎంతిచ్చారో చెప్పాలన్న నేతలు..

అంతే కాకుండా రాబోయే రెండు నెలలకు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు, వలస కూలీలకు 5వేల ఆర్థిక సాయం అందించాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేసారు. ఇళ్ల కీరాయిల చెల్లింపులపై వాయిదా వేస్తూ ఆర్డర్ తేవాలని ఇది చాలా మంది చిరు ఉద్యోగులకు లాభసాటిగా ఉంటుందనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేసారు. అంతే దూర ప్రాంతాల నుండి వచ్చి ఇరుక్కు పోయిన వారిని వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని టీ సర్కార్ కు అఖిల పక్ష నేతలు సూచించారు.

1500 రూపాయల ఆర్దిక సాయం ఇంకా అందలేదు.. కేసీఆర్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారన్న ఉత్తమ్..

1500 రూపాయల ఆర్దిక సాయం ఇంకా అందలేదు.. కేసీఆర్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారన్న ఉత్తమ్..

కరోనా మహమ్మారి వలన రెండవ ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారని టీపిసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీడియా స్వేచ్చను కోల్పోయిందని, మీడియాపై తెలియని నిర్బంధాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధిస్తున్నారని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేసారు. గత నెల 22న ప్రకటించిన సాయం ఇప్పటికీ కూడా లబ్ది దారులకు అందలేదని చెప్పారు. వలస కూలీల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని, వారి జీవనోపాది కోసం 12కిలోల బియ్యంతో పాటు ఆర్ధిక సాయం అందిచాలని డిమాండ్ చేసారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం.. సీఎం వాస్తవాలు చెప్పాలన్న అఖిలపక్షనేతలు..

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం.. సీఎం వాస్తవాలు చెప్పాలన్న అఖిలపక్షనేతలు..

అంతే కాకుండా ముఖ్యమంత్రి అనాలోచిత చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందనై అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు నేతలు. కేవలం రెండు వారాల పాటు లాక్ డౌన్ ఉంటేనే వేతనాల్లో కోత విధించే పరిస్థితి ఏర్పడిందని, దీంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత చితికిపోయిందో తేటతెల్లం అవుతుందని టీడిపి తెలంగాణ అధ్యక్షుడు యల్ రమణ, సీపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి, ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ అభిప్రాయపడ్డారు. అంబెడ్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పై పెట్టిన కేసులు ఉపసంహరణ చేసుకోవాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+