జానీ మాస్టర్ పై అల్లు అర్జున్ కుట్ర.. ఫలితం అనుభవించారు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సంధ్య థియేటర్ వద్ద పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు తీవ్రగాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జైలు నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్
ఇక ఈ ఘటనతో అల్లు అర్జున్ పైన చిక్కడపల్లి పోలీసులు పోలీస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆపై తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిలు జారీ చేసింది. దీంతో ఈ రోజు తెల్లవారుజామున అల్లు అర్జున్ చంచల్గూడా జైలు నుండి రిలీజ్ అయ్యారు.

సంచలన వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న
అయితే ఈ టోటల్ ఎపిసోడ్ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ప్రభుత్వ చర్యను సమర్థిస్తుంటే మరికొందరు అల్లు అర్జున్ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అందుకే ఇంత దారుణంగా అరెస్ట్ చేశారంటూ వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ కేసు ప్రస్తావన తెచ్చి మరీ అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు.
జానీ మాస్టర్ పై అల్లు అర్జున్ కుట్ర
జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అల్లు అర్జున్ కుట్ర ఉందని, ఆ ఉసురు తగిలే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును ప్రకటించడం అల్లు అర్జున్ జీర్ణించుకోలేకపోయాడని ఈ క్రమంలోనే నేషనల్ అవార్డు తనకు ఒకరికి మాత్రమే ఉండాలి అన్న ఆలోచనతో కుట్ర చేశారన్నారు.
జానీ మాస్టర్ నేషనల్ అవార్డు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ వెనుక బన్నీ
జానీ మాస్టర్ వద్ద పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తో కేసులు పెట్టించి జైలుకు పంపించారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. జానీ మాస్టర్ కు బెయిల్ రాకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినట్టు గుర్తు చేశారు. ఇక జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆయన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాశారని సంచలన ఆరోపణలు చేశారు.
అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వెనక్కు ఇస్తారా?
జానీ మాస్టర్ జైలుకు వెళ్ళాడు కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా అంటూ ప్రశ్నించారు .ఇక ఇదే సమయంలో పుష్ప సినిమా పైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎర్రచందనం దొంగతనం చేస్తే నేషనల్ అవార్డు ప్రకటిస్తారా అంటూ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు.
అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో అందుకే
పుష్ప సినిమా దెబ్బకు తాను సినిమాలు చూడడం మానేశానని పేర్కొన్నారు ఎర్రచందనం దొంగతనం చేయడం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుందో చెప్పాలని ఇప్పటికే ప్రశ్నించిన తీన్మార్ మల్లన్న జానీ మాస్టర్ ఉసురు తగలడం కారణంగానే అల్లు అర్జున్ కు రాత్రంతా జైల్లో ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications