తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఆమ్రపాలి
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటాని చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో.. మరో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఐటీ సంబంధిత అంశాలను ఆమ్రపాలి పర్యవేక్షించనున్నారు.
ప్రస్తుతం ఆమ్రపాలి.. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు, వరంగల్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు.రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తక్కువ సమయం ఉండడంతో ఉన్నతాధికారుల నియామకం అవసరమైంది.

ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పర్యవేక్షణలో.. ఇప్పటికే ఉన్న అధికారులపై పని ఒత్తిడి పెరిగింది. దీంతో.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు మరో ఇద్దరు అధికారులను సహాయకులుగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇప్పటికే జ్యోతి బుద్ధ ప్రకాష్ ను ఎన్నికల అదనపు అధికారిగా నియమించింది. తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని జాయింట్ సీఈఓగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications