గులాబీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే..! నేతలకు దొరక్కుండా స్విచ్చాఫ్ ఐపోయిన సంగారెడ్డి లీడర్..!
Recommended Video
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా గులాబీ పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అనుకూలంగా ప్రకటనలు గప్పింస్తూ సంచలంగా మారిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది. తాను నిత్యం విమర్శించే టీఆర్ఎస్ పార్టీలోకి మారబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీనుండి అరడజను పైగా ఎమ్మెల్యులు గులాబీ తోటలో వాలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మొన్నటి వరకూ మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసిన జగ్గారెడ్డి అదే గులాబీ పార్టీలోకి చేరి పోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అధికార టీఆర్ఎస్ పార్టీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) త్వరలో కారెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉండగా ఇప్పుడు జగ్గారెడ్డి కూడా ఆ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. కాగా, నిన్నటినుంచి జగ్గారెడ్డి తన అనుచరులకు కూడా దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
ఇక్కడి నుంచి బరిలోకి రేవంత్... టీకాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలిజాబితా విడుదల
అంతేగాక ఆయన సెల్ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసినట్లు తెలిసింది. నిన్నటినుంచి జగ్గారెడ్డి టీఆర్ఎస్లో చేరబోతున్నారనే వార్తలు ప్రసార మాధ్యమాల్లో వస్తున్నప్పటికీ ఆయన ఇంతవరకు ఖండించకపోవడంపై కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. గులాబీ పార్టీలో చేరుతున్నారు కాబట్టే జగ్గారెడ్డి తనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించడంలేదనే ప్రచారం జరుగుతోంది.