ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుంది మరో ఎన్నికల సవాల్
తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కి మూడుస్థానాలు, బీజేపీకి నాలుగు స్థానాలు కట్టబెట్టారు. అనూహ్యంగా కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించటం ఉత్తమ్ కు పెద్ద సవాల్ గా మారింది.

టీఆర్ ఎస్ కు ఊహించని షాక్ .. నల్గొండ లో ఎంపీగా ఉత్తమ్ విజయం
తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీలో గందరగోళం సృష్టించారు కేసీఆర్ . అయినా సరే ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ నాయకులు ఈసారి ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో పట్టు సాధించాలని చాలా కష్టపడ్డారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంపైనా కాంగ్రెస్ జెండా ఎగురవేశారు . నల్గొండ నుండి ఎన్నికల బరిలో నిలిచినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డిపై 23 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు టాస్క్ మొదలైంది.

నల్గొండలో ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేసే అవకాశం .. ఉపఎన్నికల బాధ్యత ఉత్తమ్ దే
ఉత్తమ్ కుమార్ నల్లగొండ నుండి ఎంపీగా గెలవడంతో, తాను ఎమ్మెల్యేగా ఎన్నికలైన హుజుర్ నగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం అంత సాధారణం కాదు. కానీ కేవలం రాహుల్ గాంధీ చెప్పడం వలన ఉత్తమ్ కుమార్ ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ప్రజలు కాంగ్రెస్ కి ఓటేసి మరీ ఉత్తమ్ ని గెలిపించారు. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు రావడం ఖాయమే. అయితే ఆ స్థానంలో ఉత్తమ్ కుమార్ భార్య కి టికెట్ వచ్చే అవకాశం ఉందని అందరు భావిస్తున్నారు .

నల్గొండ స్థానంలో ఉప ఎన్నిక ఉత్తమ్ కు సవాలే ...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ భార్య కోదాడ నుండి పోటీ చేసి అతి తక్కువ తేడాతో ఓడిపోయారు. అయితే ఉత్తమ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే హుజూర్ నగర్ లో ఇపుడు తనకి మరొక సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ అక్కడ బలమైన టీఆర్ఎస్ నాయకుడు కనుక పోటీకి దిగితే ప్రత్యర్ధులు ఎవరు కూడా గెలవలేరని తెలుస్తుంది. అయితే అక్కడ సైదిరెడ్డి అనే ప్రత్యర్థి చేతిలో కేవలం మూడువేల ఓట్ల తేడాతో మాత్రమే ఉత్తమ్ కుమార్ గెలుపొందారు. కాగా ఇప్పుడు అక్కడ సైదిరెడ్డి మళ్ళీ నిల్చుంటే తన గెలుపు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో ఉత్తమ్ తన భార్య ని గెలిపించుకోవడం అనేది ఉత్తమ్ కి ఒక సవాల్ లాగా మారిందని అందరు భావిస్తున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications