తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మపై అరెస్టు వారెంట్ జారీ చేసిన చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్
హైదరాబాద్: తాము ఆదేశించినా విచారణకు హాజరు కాకపోవటంపై ఆగ్రహించిన చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డిలపై బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలంలోని రాజేంద్రరెడ్డి నగర్లో 19 ఎకరాల లేఔట్లో పార్కులు, ప్రజావసరాల కోసం వదిలిన స్థలంలో నిర్మాణాలను నిలిపేయాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎన్జీటీలో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని, దీనిపై స్థాయీ నివేదికను సమర్పించాలని సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్లకు ట్రిబ్యునల్ ఆదేశించింది.

అయితే, ఎన్నికల జరుగుతున్న తరుణంలో విచారణకు స్వయంగా హాజరు కాలేకపోతున్నామని ఈ ఇద్దరు అధికారుల తరఫు న్యాయవాది ట్రిబ్యునల్కు నివేదించారు. జనవరి 21 నాటికి కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పిటిషనర్ ట్రిబ్యునల్కు వివరించారు. దీంతో అధికారులపై ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తమ ఉత్తర్వులు అంటే చులకనగా ఉన్నట్లుందని వ్యాఖ్యానిస్తూ జనవరి 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. ఐనా కూడా బుధవారం ఈ అధికారులిద్దరూ హాజరుకాకపోవటంతో ఎన్జీటీ చెన్నై బెంచ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications