'ఏటీఎం'పై ఉమ్మేసిపోయారు: కరెన్సీ కష్టాలతో తీవ్ర అసహనం..
ఇదే నేపథ్యంలో కొన్నిరోజులుగా కరెన్సీ కష్టాలను ఎదుర్కొంటున్న ముషీరాబాద్ ప్రాంతంలోని కొందరు వినూత్న రీతిలో తమ అసహనాన్ని వ్యక్తపరిచారు.
హైదరాబాద్: నోట్ల రద్దుతో ఇప్పటికే ఓ దఫా తీవ్ర అసంతృప్తిని అణుచుకున్న సామాన్యులు.. ఇటీవల ఎదురవుతున్న కరెన్సీ కష్టాలకు తీవ్రంగా విసుగు చెందుతున్నారు. బ్యాంకులు చాలినంత డబ్బులు ఇవ్వకపోవడం.. చాలావరకు ఏటీఎంలు 'నో క్యాష్' బోర్డులతో కనిపిస్తుండటంతో సామాన్యుల్లో అసహనం పెరిగిపోతోంది.
ఇదే నేపథ్యంలో కొన్నిరోజులుగా కరెన్సీ కష్టాలను ఎదుర్కొంటున్న ముషీరాబాద్ ప్రాంతంలోని కొందరు వినూత్న రీతిలో తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. బాగ్ లింగంపల్లిలోని ఎస్బిహెచ్, ఆంధ్రాబ్యాంకు ఏటిఎం కేంద్రాలు ఎప్పుడూ నో క్యాష్ బోర్డుతోనే దర్శనమిస్తుండటంతో వారు చర్యకు పాల్పడ్డారు.
కథ మొదటికొచ్చింది!: మళ్లీ 'నోట్ల రద్దు' నాటి పరిస్థితులు.. 'నో క్యాష్
దాదాపు 10రోజుల నుంచి ఈ ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు రాకపోవడంతో.. కిళ్లీలు నమిలి ఏటీఎం కేంద్రంలో ఉమ్మేసి వెళ్లారు. ఇంత జరిగినా బ్యాంకు తీరులో మాత్రం మార్పు లేదు. ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సింది పోయి.. వాటికి పూర్తిగా తాళం వేసేశారు