షబ్బీర్, ఉత్తమ్లపై దాడి: పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన అసదుద్దీన్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ నేతల పైన దాడి కేసులో మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం నాడు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈ నెల 2వ తేదీన జరిగాయి. చివరి నిమిషంలో పాతబస్తీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అసదుద్దీన్తో పాటు పదిహేను మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గ్రేటర్ ఎన్నికల సమయంలో మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత షబ్బీర్ అలీల పైన దాడి జరిగింది. ఈ దాడి కేసులో అసదుద్దీన్ సోమవారం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
అసదుద్దీన్కు బెయిల్
ఉత్తమ్, షబ్బీర్ అలీల పైన దాడి కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బెయిలు మంజూరైంది. హైదరాబాద్ నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అసద్ ఉదయం సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఎదుట లొంగిపోయారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications