సీటు దక్కినా విజయం వరించేనా - అజార్ పై విష్ణు గుగ్లీ..!!
తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటోంది. అధికారం లక్ష్యంగా కంగ్రెస్ అభ్యర్దుల ఎంపిక చేసామని చెబుతోది. రెండో జాబితా ప్రకటన తరువాత అనూహ్య అంశాలు తెర మీదకు వస్తున్నాయి. సీటు ఆశించి దక్కని ఆశావాహులు పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఖైరతాబాద్ అభ్యర్థిగా పీజేఆర్ కుమార్తె పి.విజయారెడ్డికి అవకాశం కల్పించారు. ఇక్కడ ఇప్పుడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
మారుతున్న లెక్కలు : కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనతో పలు నియోజకవర్గాల్లో లెక్కలు మారుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఖైరతాబాద్ అభ్యర్థిగా పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి అవకాశం కల్పించారు.

పీజేఆర్ కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్ఠానం తర్జన భర్జన పడింది. జూబ్లీహిల్స్ నుంచి పి.విష్ణువర్ధన్రెడ్డి, ఖైరతాబాద్ నుంచి పి.విజయారెడ్డి దివంగత నేత కుటుంబం నుంచి టికెట్ ఆశించారు. వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై స్ర్కీనింగ్ కమిటీ పలుమార్లు బైఠాయించింది. చివరకు విజయారెడ్డి వైపే మొగ్గు చూపించింది.
జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ : ఖైరతాబాద్ నుంచి పి.విజయారెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సింగిరెడ్డి రోహిణ్రెడ్డి టికెట్ ఆశిస్తూ వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కలగజేసుకొని రోహిణ్రెడ్డిని అంబర్పేట నుంచి పోటీ చేసేలా ఒప్పించారు. దీంతో విజయారెడ్డికి మార్గం సుగమమం అయింది. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో అసమ్మతికి కూడా చెక్ పెట్టినట్టు అయింది.
ఇక జూబ్లీహిల్స్ నుంచి పి.విష్ణువర్ధన్రెడ్డితోపాటు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరు పరిశీలనకు వచ్చింది. మొదట విష్ణుకే టికెట్ వస్తుందని అందరూ భావించారు. పార్టీ విషయంలో ఆయన నిర్లక్ష్య ధోరణిని అధిష్ఠానం సీరియ్సగా తీసుకుంది. పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్ ఎలా ఇస్తారనే వాదనలు వెల్లువెత్తాయి. దీంతో విష్ణుకు చెక్ పెడుతూ అజారుద్దీన్ పేరును ఖరారు చేశారు. విష్ణుకు చెందిన ఓ సన్నిహిత వర్గం అజారుద్దీన్ వైపు మొగ్గు చూపించింది.
పెరుగుతున్న అసమ్మతి : విష్ణు నాయకత్వం వద్దంటూ అధిష్ఠానంను కలిసింది. అవన్నీ పరిగణలోకి తీసుకోవడంతోపాటు నియోజకవర్గంలోని మైనార్టీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అధిష్ఠానం అజారుద్దీన్ పేరు ప్రకటించింది. దీంతో, ఇప్పుడు విష్ణు కాంగ్రెస్ వీడేందుకు సిద్దమయ్యారు. విష్ణు తన పేరు బ్యాలెట్ లో ఉంటుందని ఖచ్చితంగా చెబుతున్నారు.
దీని ద్వారా అవసరమైతే స్వతంత్ర అభ్యర్దిగా అయినా బరిలోకి దిగేందుకు సిద్దం అవుతున్నారనేది స్పష్టం అవుతోంది. ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్ది బరిలో ఉన్నారు. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో తలెత్తే అసమ్మతి విషయంలో పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. క్రికెట్ జీవితంలో వివాదాలు ఎదుర్కొన్న అజారుద్దీన్ తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో ఏ రకంగా సక్సెస్ అవుతారనేది చూడాలి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications