చండీయాగంలో అగ్నిప్రమాదంపై నాగఫణీ శర్మ, బాల్క సుమన్: ప్రణబ్ పర్యటన రద్దు
మెదక్: ఆయుత చండీయాగం సంపూర్ణంగా సఫలమైందని మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న చండీయాగం చివరి రోజు స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది.
దీనిపై నాగఫణి శర్మ స్పందించారు. భారతీతీర్థ, శంకరాచార్య పర్యవేక్షణలో యాగం సుసంపన్నమైందన్నారు. అభిజిత్ లగ్నంలో పూర్ణాహుతి జరగాల్సి ఉందని, కానీ ముందుగానే శాస్త్రోక్తంగా జరిగిపోయిందన్నారు. నిర్వాహకులు కెసిఆర్ యాగవిభూతి ధరించారన్నారు.

సంప్రోక్షణ ప్రారంభమైంది: బాల్క సుమన్
అయుత చండీయాగం యాగశాల సంప్రోక్షణ ప్రారంభమైందని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. పూర్ణాహుతి తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయన్నారు. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం విరామ సమయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
సంప్రోక్షణ అనంతరం అయుత మహాచండీయాగం మహా పూర్ణాహుతి కోసం ఏర్పాట్లు త్వరితగతిన జరుగుతున్నట్లు సుమన్ చెప్పారు. కాగా, మహాపూర్ణాహుతి కార్యక్రమానికి గవర్నర్ దంపతులు హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ఈ కార్యక్రమానికి హాజరుకావట్లేదు. భద్రతా కారణాల రీత్యానే ఆయన ఇక్కడికి హాజరు కావడం లేదని తెలుస్తోంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications