బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ మోసం..: కరీంనగర్ అభ్యర్థి లేరంటూ బండి సంజయ్
సిరిసిల్ల: బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి ఐదేళ్లలో రూ. 12 వేల కోట్ల నిధులు తెచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు.
కరోనా సమయంలో బీజేపీ నాయకులు ప్రజలకు అనేక సేవలు అందించారన్నారు బండి సంజయ్. ఇలా సేవలు చేస్తూ 8మంది కార్యకర్తలు మరణించారని చెప్పారు. కానీ, అప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కనీసం బయటకు రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తుందని విమర్శించారు.

కరీంనగర్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్కు అభ్యర్థులు కూడా కరువయ్యారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్, రైతులను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని పోరాటం చేసింది తామే అని బండి సంజయ్ గుర్తు చేశారు.
అంతకముందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరులో బండి సంజయ్ పర్యటించారు. కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. పార్టీలు, కులాలకు అతీతంగా జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయిపాపన్న పేరు పెడితే హర్షిస్తామని, అయినా ఆ పని ఎందుకు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించి, అక్కడున్న గీత కార్మికులను పరామర్శించడం జరిగింది.
— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) April 21, 2024
రాష్ట్రవ్యాప్తంగా గీత కార్మికులు కష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలన్న సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది.
🔸గౌడన్నల ఆత్మగౌరవ… pic.twitter.com/GCjgjWTVWg
తమ కార్యకర్తలు రాముని గుడి కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. తెలంగాణలో రామ రాజ్యం రావాలని చెప్పారు. రాముని పేరు చెప్పి ఉంటాం కానీ ఓట్ల కోసం మాత్రం కాదు, భక్తితో చెప్పి ఉంటాం. మేము రాముని పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం లేదు. కానీ అవతలివారు రాముని పేరు చెప్పగానే భయపడుతున్నారని బండిసంజయ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఎవరి అకౌంట్లో అయినా 2500 రుపాయలు పడ్డాయా? ఆరు గ్యారంటీలు అనగానే ఓట్లన్నీ అటే వేశారు. ఇళ్లు కట్టుకోడానికి రూ.5లక్షలు ఇస్తామన్నారు. ప్రజల దగ్గరి నుంచి గుంజుకోకపోతే చాలు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు కేసులు పెట్టింది మా పైన, జైలుకు వెళ్లింది మేము. కానీ, మీరు ఓట్లు వేసింది మాత్రం కాంగ్రెస్ వాళ్లకు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ తప్పు చేయవద్దన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications