ట్విట్టర్ టిల్లు.. సమాధానం చెప్పు? చేనేత జీఎస్టీపై వీడియోతో కేటీఆర్ టార్గెట్గా బండి సంజయ్
చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆర్ నే అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ విషయంపై కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను మీడియా ఎదుట ప్రదర్శించి మరీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశారు.

మంత్రి కేటీఆర్ చేనేత జీఎస్టీపై రాసిన లేఖకు బండి సంజయ్ కౌంటర్
మునుగోడు ఎన్నికల్లో భాగంగా దీపావళి రోజున బండి సంజయ్ చౌటుప్పల్ లోని చినకొండూరు రోడ్డువద్దనున్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునుగోడుసహా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించే ముందు చేనేత పై జిఎస్టి రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ చేనేతపై జీఎస్టీ విధించాలంటూ కేటీఆర్ చేసిన వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్శించారు.

కేటీఆర్ జీఎస్టీ సమావేశంలో మాట్లాడిన వీడియోతో టార్గెట్ చేసిన బండి సంజయ్
ఇదిగో వీడియో... ట్విట్టర్ టిల్లు దీనికేం సమాధానం చెబుతావ్? అంటూ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశారు. జీఎస్టీ సమావేశంలో పాల్గొన్నదెవరు? అక్కడఏం చెప్పినవ్.. చేనేతపై 5 శాతం జీఎస్టీ వేయాలని కేంద్రాన్ని కోరింది నువ్వే కదా అంటూ మండిపడ్డారు. మరి జిఎస్టి సమావేశంలో చేనేత పై జిఎస్టి రద్దు చేయాలని చెప్పకుండా ఏం పీకారంటూ తీవ్ర వ్యాఖ్యలతో నిప్పులు చెరిగారు. చేనేత వస్త్రాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఆ హామీని నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బతుకమ్మ చీరలను వేసే అవకాశం చేనేత కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి, మంత్రులుమునుగోడు ప్రజలకు అనేక హామీలిచ్చారు? వాటిలో ఎన్ని నెరవేర్చారు? చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు చాలా హామీలను నెరవేర్చనే లేదన్నారు. మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పకుండా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుండటం సిగ్గు చేటని బండి సంజయ్ విమర్శించారు.దొంగ సంతకాలు సృష్టించి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు, గోల్డ్ బిస్కెట్లు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

పొరబాటున కూడా టీఆర్ఎస్ కు ఓటెయ్యకండి
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేవలం మునుగోడు ఉపఎన్నికలు మాత్రమే కాదని, తెలంగాణ భవిష్యత్తుకు ముడిపడివున్న ఎన్నికలని బండి సంజయ్ వెల్లడించారు. పొరపాటున టిఆర్ఎస్ పార్టీని ఎన్నికలలో గెలిపిస్తే కెసిఆర్ అహంకారం మరింత తలకెక్కుతుందని బండి సంజయ్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నా, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయినా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా, దళిత బందు ఇవ్వకున్నా ప్రజలు ఓట్లు వేశారని, కెసిఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పార్టీని మునుగోడులో బండకేసి బాదండి
దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో హామీలు నెరవేర్చని టిఆర్ఎస్ పార్టీని అక్కడి ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. మునుగోడు ప్రజలు సైతం కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని బండకేసి బాదాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటేయాలని పేర్కొన్న బండి సంజయ్ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications