విఎన్ఆర్ కాలేజ్, బియాస్ నది ట్రాజెడీ: వడ్డీ సహా రూ.20లక్షల పరిహారం ఇవ్వాలని హైకోర్టు
సిమ్లా/హైదరాబాద్: 2014 ఏడాదిలో హైదరాబాద్ విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు శనివారం నాడు తీర్పు చెప్పింది. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహార ఇవ్వాలని ఆదేశించింది.
ఈ ఘటనలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని హైకోర్టు మండిపడింది. బాధితుల కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, ఈ పరిహారంలో 60 శాతాన్ని బియాస్ నది ఆనకట్ట బోర్డు చెల్లించాలని ఆదేశించింది.

30 శాతాన్ని కళాశాల యాజమాన్యం, మిగిలిన పది శాతాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. పరిహారంపై 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.
2014 జూన్ 8న హైదరాబాదులోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతి చెందారు. నాడు మృతి చెందిన వారిలో ఆరుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications