నిన్న కావేరీ, నేడు ఏపీ, తెలంగాణలకు కృష్ణా నీళ్లు: బీజేపీది రాజకీయ మౌనమా?
విజయవాడ: కృష్ణా నీటి విషయంలో బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు పైన తాము సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తామని, నాలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగాలని కోరుతామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నాడు అన్నారు.
గత ప్రభుత్వాలు కృష్ణా నీటి విషయంలో సరైన వాదనలు వినిపించలేకపోయాయని చెప్పారు. అందుకే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. తీర్పు పైన సుప్రీం కోర్టులో ఏపీ తరఫున వాదనలు వినిపిస్తామని చెప్పారు.

కేంద్రం గొడవలు పెడుతోంది: నారాయణ
నీటి పంపిణీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుండా బిజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య గొడవలు పెడుతోందని, తద్వారా రాజకీయ పబ్బం గడుపుకుంటోందని సిపిఐ నేత నారాయణ విమర్శించారు.
కావేరీ నదీ జలాల విషయంలో కోర్టు తీర్పును కర్నాటక అమలు చేయకపోతే కేంద్రం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. అంతే తప్ప సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు.
ఇప్పుడు కృష్ణా జలాల విషయంలోను అదే తరహా వ్యవహరిస్తోందన్నారు. రాజకీయంగా లబ్ధి చేకూరే మహారాష్ట్ర, కర్నాటకలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తనకు ప్రాధాన్యం లేని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను వదిలేసిందని విమర్శించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications