maruthi rao suicide: మానసిక ఒత్తిడా..? సోదరుడి వేధింపులా...? ఆత్మహత్యకు కారణమేంటీ..?
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీరావు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటీ..? కూతురు చేత ఛీత్కరానికి గురవడమా..? లేదంటే కేసులా వేధింపులా..? ఇటీవల మారుతీరావు షెడ్డులో లభించిన మృతదేహాం ఎవరిదీ..? ఆ హత్యతో మారుతీరావుకు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు సగటు వ్యక్తి మెదడును తొలచివేస్తోంది. వీటితోపాటు ఆస్తికి సంబంధించిన లావాదేవీల్లో కూడా గొడవలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంతకీ మారుతీరావు ఆత్మహత్యకు కారణమెంటీ..?
Recommended Video

ఒక్కరే కూతురు..
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు మధ్యతరగతి కుటుంబం. కానీ రియల్ ఎస్టేట్ ద్వారా కోట్లు సంపాదించారు. మారుతీరావుకు ఒక్కరే కూతురు అమృత.. కానీ ఆమె ప్రణయ్ను ప్రేమించింది. వారి ప్రేమను అంగీకరించకపోవడంతో.. ఇంట్లో నుంచి బయటకి వెళ్లి పెళ్లి చేసుకుంది. దీంతో రగిలిపోయిన మారుతీరావు రెండేళ్ల కిందట కిరాయి రౌడీలతో హత్య చేయించాడు. ఇక అప్పటినుంచి మారుతీరావు పతనం ప్రారంభమైంది. ప్రణయ్ హత్యతోపాటు ఇతర కేసులు కూడా మారుతీరావును వెంబడిస్తున్నాయి. ఇటీవలే షెడ్డులో మరో డెడ్ బాడీ దొరికింది. దీంతోపాటు చాలా కేసులు మారుతీరావు మెడకు చుట్టుకున్నాయి. కేసులతో ఉక్కిరి బిక్కిరయ్యారని వాదన ఉన్న.. పోలీసుల వేధింపుల వల్లేనని కుటుంబసభ్యులు చెప్తున్నారు.

సోదరుడి వేధింపులు...
మరోవైపు మారుతీరావు సోదరుడి నుంచి కూడా వేధింపులు వస్తున్నాయి. మారుతీరావుకు ఒక్కరే సంతానం.. తన భర్తను హత్య చేయించడంతో తండ్రి మీద అమృత పీకలమీద కోపంతో ఉన్నారు. దీంతో తన కుమారులపై ఆస్తి రాయాలని సోదరుడు అడుగుతున్నాడు. ఆస్తి ఎవరి పేరు మీద రాస్తారని.. కుమారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దీనిపై సోదరుడికి ఏం చెప్పాలో తెలియని మారుతీరావు.. మిర్యాలగూడకు వెళ్లడం లేదు. పని ఉంటే తప్ప అక్కడికి వెళ్లడం లేదు. హైదరాబాద్లోనే ఉంటున్నారు. మిర్యాలగూడకు వెళితే సోదరుడి కుమారుల మీద ఆస్తి రాయాల్సి వస్తుందని అనుకొని ఉంటాడు. అందుకే సిటీలోనే మారుతీరావు గడుపుతున్నారు.

ప్రణయ్ హత్య
గర్భవతి అయిన అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తోన్న సమయంలో దాడి చేశారు. ప్రణయ్ను దారుణంగా హత్య చేశారు. ప్రణయ్ దాడి కేసులో తన తండ్రి మారుతీరావుపై అమృత అనుమానం వ్యక్తం చేశారు. హత్య, పీడీ యాక్ట్ కేసు పెట్టడంతో.. మారుతీరావు జైలుకెళ్లాడు. ఆరునెలల కింద జైలు నుంచి బయటకువచ్చాడు. అప్పటినుంచి కూతురుతో సంప్రదింపులు జరిపాడు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి మొత్తం అమృత పేరున రాస్తానని మధ్యవర్తులతో రాయబారం నడిపినట్టు తెలుస్తోంది. కానీ అందుకు అమృత అంగీకరించకపోవడంతో.. ఆత్మహత్య శరణ్యం అనుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications