బీజేపీ నేత కిషన్ రెడ్డి తల్లి అండాలమ్మ కన్నుమూత .. విషాదంలో కిషన్ రెడ్డి
బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎనభై ఏళ్ళ వయసున్న తల్లి అండాలమ్మ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
తెలంగాణా
స్థానిక
సంస్థల
ఎన్నికల్లో
జనసేన
గుర్తుల
గోల
..
ఒకటి
కాదు
రెండు
గుర్తులు
కిషన్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో గురువారం ఆండాలమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. అండాలమ్మ మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.ఆమె పార్ధివ దేహాన్ని స్వస్థలం కందుకూరు మండలం తిమ్మాపూర్కు తరలించారు .
బిజెపి నాయకుడు కిషన్ రెడ్డి తల్లి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.