జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్ధిగా - అనూహ్య ఎంపిక, మారిన లెక్కలు..!!
జూబ్లీహిల్స్ అభ్యర్ధి విషయంలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ బై పోల్ ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీఆర్ఎస్ ఇప్పటికే సునీతను తమ అభ్యర్ధి గా ప్రకటించగా.. కాంగ్రెస్ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది. బీజేపీ అభ్యర్ధి విషయంలో కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవటంతో.. బీజేపీ ఎవరిని బరిలోకి దించుతుందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ రోజు నోటిఫికేషన్ జారీతో ఇక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్ధులను ప్రకటించాయి. బీజేపీ సైతం ఇక్కడ అభ్యర్ధి ఖరారు పైన కసరత్తు చేసింది. సామాజిక సమీకరణాలు.. పార్టీల బలాబలాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్ధి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ పార్టీ నుంచి ముగ్గురు పేర్లు కేంద్ర కమిటికీ అందాయి.

కాగా, ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో పోటీ కోసం దీపక్రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారు. ఈ పేర్ల పైన పార్టీ నాయకత్వం చర్చించింది.
అయితే, తెలంగాణలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్దిగా దీపక్ రెడ్డి పేరు ఖరారు చేసినా.. చివరి నిమిషంలో ప్రకటించ కుండా.. మరింత చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్న నేపథ్యంలో.. బీజేపీ నుంచి ఎవరిని పోటీ పెడితే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో పోటీచేసిన మాధవీలత అభ్యర్థిత్వం పైనా పరిశీలన చేసారు.
అయితే.. రాష్ట్ర నాయకత్వం నుంచి దీపక్ రెడ్డి సరైన అభ్యర్దిగా సూచన రావటంతో.. ఈ ఇద్దరిలో ఒకరి పేరును ఈ రోజు బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది. దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో 25,866 ఓట్లు సాధించారు. ఇక.. బీజేపీ సైతం ఇక్కడ పోటీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో.. ఇక.. ప్రచార పర్వం లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications